మెహిదీపట్నం : చల్లని సాయంకాలం…కుతుబ్ షాహి టూంబ్స్ బ్యాక్ డ్రాప్లో అద్బుతమైన పాశ్చత్య సంగీతం.. నగర వాసులను ఓలలాండించింది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు గోల్కొండ సెవన్ టూంబ్స్లో ఉన్న ఓపెన్ హంపీ థియేటర్లో 4 వ హైదారాబాద్ అంతర్జాతీయ జాజ్ ఫెస్టివల్ను యూఎస్, జర్మనీ దౌత్య కార్యాలయం, హెచ్ఎండీఎ, జీహెచ్ఎంసీ, గోతె జంత్రమ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆమెరికా కాన్సుల్ జోయల్రైఫ్మాన్ ,డిప్యూటీ హై కమీషనర్ అండ్రుఫ్లెమింగ్, చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్రంజన్, యూకె అధికారులు తదితరులు పాల్గొన్నారు. చారిత్రక ప్రాంతం, పాశ్చత్య సంగీతం అనుసంధానించడం గొప్ప విషయం అని అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రైఫ్మెన్ అన్నారు.