వనపర్తి రోడ్లకు సొబగులు వస్తున్నాయి. 30 ఏండ్లుగా విస్తరణకు నోచు కోని రోడ్లు విశాలంగా మారుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి చొరవతో జిల్లాకేంద్రంలో నాలుగు వైపులా విస్తరణ పనులు చేపట్టారు. కొన్ని చోట్ల చివరి దశలో ఉండగా.. మరికొన్ని చోట్ల శరవేగంగా సాగుతున్నాయి. రూ.50 కోట్లతో నేషనల్ హైవే లుక్ తీసుకొస్తున్నారు. ఇన్నాళ్లూ ట్రాఫిక్ సమస్యలతో.. ఇరుకు సందులతో ఉన్న పట్టణం సుందరంగా మారనున్నది. ప్రయాణికులు, వాహనదారులకు యాతనతీరనుండగా.. ప్రయాణం మరింత సాఫీగా సాగనున్నది.
వనపర్తి, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : 30 ఏండ్లుగా వనపర్తి పట్టణ ప్రజలను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించనున్నది. ఇ రుకురోడ్లపై ప్రయాణించాలంటే ప్రయాసలు పడాల్సి వచ్చేది. ఒక వా హనం ఎదురుగా వస్తే.. మరో వాహనం వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. సమైక్య పాలనలో ఇక్కడి ఎమ్మెల్యేలు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నా.. మాకెందుకులే అనే ధోరణిలో వ్యవహరించారు. రోడ్ల విస్తరణ చేపట్టాలన్న సోయి లేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ సర్కార్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఇరుకురోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు. రో డ్లకు ఆనుకొని ఉన్న దుకాణ సముదాయాలు, వ్యాపారస్తులు మొ దట్లో కొంత వ్యతిరేకించినప్పటికీ.. మంత్రి వారితో చర్చలు జరిపి ఒప్పించారు. రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాలు, భూములు కో ల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూ రు చేస్తూ వారి నష్టాన్ని భర్తీ చేస్తున్నారు. జిల్లా కేంద్రం నాలుగువైపు లా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. వనపర్తి-చిట్యాల, జడ్చ ర్ల, పెబ్బేరు, పాన్గల్ మార్గంలో రోడ్డును వెడల్పు చేస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా పాతబస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు కళాశాలకు సమాంతరంగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి.
అభివృద్ధికి ప్రతిపక్షాల అడ్డంకులు..
వనపర్తి జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ.. రోడ్ల విస్తరణలో కొంతమంది వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మంత్రి నిరంజన్రెడ్డి చొరవతో ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నా.. కొంతమంది ప్రతిపక్షాల నాయకులు, వ్యాపారస్తులు సహకరించడం లేదు. ఇండ్లు, దుకాణాలు కోల్పోయినా.. మిగిలిన స్థ లంలో మళ్లీ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. మరికొందరు తమ ఆస్తి మొత్తం కోల్పోయినా ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం అందుకొని సహకరిస్తున్నారు. కానీ, ప్రతిపక్షాల నాయకులు మాత్రం మోకాలడ్డుతున్నారు. అంబేద్కర్ చౌక్, గాంధీచౌక్ మీదుగా గోపాల్పేటకు వెళ్లే మార్గంలో కొంతమంది విస్తరణకు సహకరించడంలేదు. అదేవిధంగా పాత బస్టాండ్ నుంచి పెబ్బేరు మార్గంలో కొన్ని భవనాలను తొలగించాలని పదేపదే చెబుతున్నా కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. అంతేకాకుండా కరెంట్ పోల్స్ షిఫ్టింగ్ చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు సహకరించడం లేదు. దీంతో రోడ్డు పనుల్లో జాప్యం కలుగుతున్నది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. వాటి బాధ్యతలను మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ గట్టుయాదవ్, శ్రీధర్, మాజీ చైర్మన్ రమేశ్గౌడ్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణకు అప్పగించారు.
రూ.50 కోట్లతో నేషనల్ హైవేలుక్..
జిల్లా కేంద్రంలోని రోడ్లకు నేషనల్ హైవేలుక్ కల్పించనున్నారు. రూ.50 కోట్లతో ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు వెడల్పు పనులు చేస్తున్నారు. జడ్చర్ల మార్గంలో మూడు, పెబ్బేరు మార్గంలో ఒకటి, పాన్గల్ మార్గంలో ఒకటి, చిట్యాల రోడ్డు మార్గంలో కిలోమీటర్ మేర పనులు జరుగుతున్నాయి. పట్టణం మొత్తం నాలుగు లేన్ల మార్గాన్ని రూపొందిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫిబ్రవరి మొదటివారంలో రానున్న నేపథ్యంలో నిర్ణీత సమయంలోగా రోడ్లు పూర్తి చేయాలని మంత్రి నిరంజన్రెడ్డి కాంట్రాక్టర్లను ఆదేశించారు. అయితే, పనుల జాప్యంపై మంత్రి నిరంజన్రెడ్డి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులను మందలించినట్లు సమాచారం.