మహేశ్వరం : దేవాలయాల అభివృద్దికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం
మహేశ్వరం శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా నిమ్మగూడెం సుధీర్గౌడ్కు నియామక ఉత్తర్వు లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం సిద్దించిన తర్వాతనే దేవాలయాలకు ప్రాధాన్యత పెరిగిందని అన్నారు.
దేవాలయాలను అభివృద్ది చేయడానికి దేవాలయ కమిటీ సభ్యులు సమిష్టి కృషితో పని చేయాలని ఆమె సూచించారు. సభ్యులుగా కరోళ్ల చంద్రయ్యముదిరాజ్, మిద్దింటి బాల్రాజ్, పేయల యాదమ్మ, కరోళ్ల రవీందర్, కూన వెంకటేశ్, కటికెల మహేందర్ లను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు అంగోతు రాజునాయక్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆధిల్అలీ, మండల రైతు బంధు చైర్మన్ పరిగి రాఘవేందర్రెడ్డి, నాయకులు ఆనందం, నవీన్, ఎంఏ సమీర్, మద్ది కరుణాకర్రెడ్డి, వర్కల యాదగిరిగౌడ్, దోమ శ్రీనువాస్రెడ్డి, దుడ్డు క్రిష్ణ, ఎస్.కే ఆజాం, కాకి కుమార్, మనోహార్, కటికల మైసయ్య, వీరిబాబు, సున్నం క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.