కొండాపూర్ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ సృష్టికర్త, న్యాయ కోవిదుడు, రాజ్యాంగం ద్వారా దేశానికి దశ, దిశ చూపిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సోమవారం చందానగర్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లు మంజుల రఘునాథరెడ్డి, జగదీశ్వర్గౌడ్, శ్రీకాంత్లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం, అసమానతలు, వివక్షాలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు, కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అంబేద్కర్ అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు సాగుతున్నారని, రాష్ట్రంతో పాటు ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మేలు చేకూర్చేలా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, అశోక్గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, గుడ్ల ధనలక్ష్మీ, మిరియాల రాఘవరావు, ప్రవీణ్, మల్లేష్, జనార్ధన్రెడ్డి, సంజీవరెడ్డి, లక్ష్మీనారాయణ, భద్రయ్య, మోజెస్, హరినాథ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.