సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి గురువారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందించారు. పట్టణంలోని 13 వార్డుల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 వరకు కాలినడకన తిరుగుతూ పేరుపేరునా పలుకరిస్తూ 9 గంటల పాటు ముందుకు సాగారు. వృద్ధులను ఆప్యాయంగా పిలిచి సమస్యలను తెలుసుకున్నారు. తమ గల్లీకి వచ్చిన మంత్రికి
మహిళలు బొట్టుపెట్టి, మంగళహారతులతో స్వాగతం పలికారు.
సూర్యాపేట టౌన్, జనవరి 20 : మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులు అందించారు. ఉదయం నుంచి రాత్రి వరకు రెండు విడుతల్లో పర్యటించిన మంత్రి.. 86మంది లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లారు. పేరుపేరున పలుకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. స్వయంగా వచ్చి చెక్కులు ఇవ్వడంతో లబ్ధిదారులు, స్థానిక మహిళలు హారతి పట్టి స్వాగతించారు. కొవిడ్ నేపథ్యంలో నలుగురు అధికారులు, సంబంధిత వార్డు కౌన్సిలర్లతో కలిపి నిరాడంబరంగా పర్యటించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, నాయకులు