మహబూబ్నగర్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : నీటి పారుదల శాఖపై సోమవారం కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. పలు అంశాలకు ఆమోదం తెలిపింది. ఉమ్మడి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం వరాలు ప్రకటించింది. నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం టెండర్లు పిలిచేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ ఎత్తిపోతలతో దేశంలోనే అత్యంత వెనుకబడిన గట్టు మండలానికి తాగునీటి సమ స్య తీరనున్నది. ఎంజీకేఎల్ఐలో భాగంగా ప్రస్తుతం సాగునీరు అందిస్తున్న ఘణపురం బ్రాంచ్ కెనాల్ నిర్మాణానికి సైతం కేబినెట్ ఆమోదించడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..