బేగంపేట్: విద్యార్ధులు క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించాలని సికింద్రాబాద్ డిప్యూటీ ఈవో సురేశ్కుమార్ సూచించారు. ప్లాన్ఇండియా ఆధ్వర్యంలో సోమవారం రాంగోపాల్పేట్ డివిజన్లోని ప్రభుత్వబాలికల పాఠశాలలో విద్యార్ధులకు స్డడీకిట్స్ను అందించారు. ఈ కార్యక్రమంలో 6 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,డిప్యూటీ ఐవోఎస్ సుమన్రాథోడ్లు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా ప్లాన్ ఇండియా ప్రాజెక్ట్ లీడ్ శాలిని మాట్లాడుతూ..మెనస్ట్రల్ హైజిన్ ఫ్రెండ్లీ స్కూల్ పేరుతో ఆరు పాఠశాలలు అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. పాఠశాలలో సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే 15వందల మంది విద్యార్ధులకు ఈ ప్రాజెక్ట్లో భాగంగా స్డడీ కిట్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం ఈ ప్రాజెక్టును వారు లాంఛనంగా ప్రారంభించారు.