ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
భువనగిరి అర్బన్, జనవరి 20 : టీఆర్ఎస్ పార్టీ కల్పించిన బీమా కార్యకర్తల కుటుంబాలకు ఎంతో ధీమాగా ఉంటుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని 9వ వార్డు ఎల్బీనగర్కు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కొలుపుల రామస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పార్టీ ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ.2లక్షల చెక్కును రామస్వామి భార్య అనితకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉంటున్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ సభ్యత్వం పొందడంతో ప్రమాదవశాత్తు మృతి చెందితే ప్రమాద బీమా కింద రెండు లక్షలు అందజేసి ఆ కుటుంబానికి అండగా ఉంటున్నదని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నిత్యం ప్రజా సంక్షేమం కోసమే కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, నాయకులు ఎడ్ల రాజేందర్రెడ్డి, బాషబోయిన రాజేశ్, గోమారి సుధాకర్రెడ్డి, తాడెం రాజశేఖర్, కాటిక జంగయ్య పాల్గొన్నారు.
యూజీడీ పనులను త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే
భువనగిరి అర్బన్, జనవరి 20 : పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. గురువారం యూజీడీ, ఆర్బీనగర్లో రూ.45లక్షలతో చేపడుతున్న చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనులు జాప్యం లేకుండా నాణ్యతతో చేపట్టాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.