జూబ్లీహిల్స్ : యూసుఫ్గూడ ఫస్ట్ పోలీస్ బెటాలియన్లో మంగళవారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీపీ అభిలాష బిస్త్ అధ్యక్షతన రాష్ట్రంలోని 13 బెటాలియన్స్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ డాక్టర్ జితెందర్, డీఐజీ సిద్దిఖీ, కమాండెంట్ ఎకె మిశ్రాతో పాటు రాష్ట్రంలోని 13 బెటాలియన్ల అధికారులు పాల్గొన్నారు.