నేరేడుచర్ల: దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూరి యశోద రాములు కోరారు. సోమవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో స్ధానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాలలోనే మద్ధతు ధర లభిస్తుందన్నారు.
రైతులు 17శాతం తేమ కలిగిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కొనుగోలు కేంద్రాలలోనే పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేపడుతారని, రైతులు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల, పాలకవీడు మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు అరిబండి సురేష్, కిష్టిపాటి అంజిరెడ్డి, చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్ అనంతు శ్రీనివాస్, మత్స్యకార్మిక సహకార సంఘం చైర్మన్ పేరబోయిన వీరయ్య, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కెండేయ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కొప్పుల రాంరెడ్డి, డైరెక్టర్లు శంకరాచారీ, సురేష్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జయమ్మ, మార్కెట్ డైరెక్టర్ సుందరయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.