ఉమ్మడి జిల్లాలోని అవినీతి జలగలు..
ఉమ్మడి జిల్లాలోని అవినీతి జలగలు..
ఉమ్మడి జిల్లాలోని అవినీతి జలగలు..
ఫిబ్రవరి 17, 2020 : మహబూబ్నగర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మహమ్మద్ వాజీద్ ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నాడు. ఓ వ్యక్తికి చెందిన ఫుడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసేందుకు రూ.4 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
ఫిబ్రవరి 24, 2020 : నారాయణపేట జిల్లా చెన్నారెడ్డిపల్లి వీఆర్వో హెచ్.పద్మనాభ పట్టాదార్ పాస్బుక్ జారీ కోసం రూ.8 వేలు తీసుకుంటూ దొరికిపోయాడు.
మార్చి 6, 2020 : ఓ ఎక్సైజ్ కేసులో సీజ్ అయిన కారును రిలీజ్ చేసేందుకు అచ్చంపేట ఎక్సైజ్ కార్యాలయంలో చేసుకున్న దరఖాస్తును ఆ శాఖ డీసీకి ఫార్వర్డ్ చేసేందుకు స్థానిక ఎక్సైజ్ సీఐ శ్రవణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ దేవేందర్ నాయక్ రూ.9 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
జూలై 2, 2020 : కొందరికి చెందిన ఇన్సూరెన్స్ దరఖాస్తులు కార్మిక శాఖ డిఫ్యూటీ కమిషనర్కు ఫార్వర్డ్ చేసేందుకు రూ.6వేలు లంచం తీసుకుంటుండగా.. మహబూబ్నగర్ రెండో సర్కిల్కు చెందిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వాడ్రేవు కోటేశ్వర్ రావు ఏసీబీకి దొరికాడు.
జూలై 23, 2020 : వడ్డేపల్లిలో మెడికల్ ఆఫీసర్ లీవ్ దరఖాస్తును వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్కు ఫార్వర్డ్ చేసేందుకు సాక్షాత్తు జిల్లా వైద్యాధికారే లంచం ఆశించారు. అప్పటి డీఎంహెచ్వో కేతావత్ భీమ పబ్లిక్ హెల్త్ నర్స్ బ్యూల ద్వారా రూ.7 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఆగస్టు 6, 2020 : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరు వీఆర్వో నాయిని వెంకటరమణ ఓ రైతు భూమిని మ్యుటేషన్ చేసేందుకు రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.
ఆగస్టు 22, 2020 : మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ క్లోరినేషన్ కొటేషన్లను కలెక్టరేట్కు ఫార్వర్డ్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.1.65 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
నవంబర్ 4, 2020 : బాలానగర్ రెసిడెన్షియల్ పాఠశాల ఫీల్డ్ ఆఫీసర్ జి.విజయభాస్కర్ ఓ ఉద్యోగి పనితీరు సరిగా ఉందని ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపించేందుకు రూ.5వేలు తీసుకుంటూ దొరికిపోయారు.
నవంబర్ 27, 2020 : ఆగస్టు 22, 2020న లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అప్పటి మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్కు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని గుర్తించిన ఏసీబీ అధికారులు మరోమారు కేసు నమోదు చేశారు. రూ.3.91 కోట్లు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సంపాదించారు. ప్లాట్లు, నగదు, బంగారం పట్టుబడింది. సురేందర్ తన జీతానికి మించి 202 శాతం అక్రమంగా కూడబెట్టినట్లుగా నిర్ధారించారు.
మార్చి 3, 2021 : మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మత్స్యశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గంగారాం మత్స్య సహకార సొసైటీ సభ్యుల స్కిల్ టెస్టు పాస్ చేసేందుకు రూ.45వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
ఏప్రిల్ 4, 2021 : క్వారీ లీజు ఎన్వోసీ సర్టిఫికెట్ను మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్కు ఫార్వర్డ్ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలను వెల్దండ తాసిల్దార్ జి.సైదులు.. కె.వెంకటయ్యతో లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం సొమ్ము ఏసీబీకి చిక్కకుండా చేసేందుకు వెంకటయ్య పొయ్యిలో వేసి కాల్చేశాడు. అయినా, సాంకేతిక ఆధారాలతో అవినీతి అధికారిని, సహకరించిన వ్యక్తిని అధికారులు కటకటాల పాలు చేశారు.
ఏప్రిల్ 4, 2021 : రేవల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్ హరున్ రషీద్, టెక్నికల్ అసిస్టెంట్ కె.చిన్న బంగారయ్య.. ఉపాధిహామీలో పనులు చే సిన పశువుల కొట్టం బిల్లు చేసేందుకు రూ.4 వేలు తీసుకుంటూ దొరికిపోయారు.
జూన్ 6, 2021 : అటవీ శాఖకు మొక్కలు పంపిణీ చేసిన కాంట్రాక్టర్కు బిల్లు చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేసిన వనపర్తి, జోగుళాంబ గద్వాల డీఎఫ్వో మాగంటి బాబ్జీరావు రూ.3 లక్షలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
సెప్టెంబర్ 22, 2021 : జోగుళాంబ గద్వాల జిల్లా ఐకేపీ సర్వేయర్ హెచ్. తిక్కయ్య.. ఓ రైతుకు సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు. రూ.20వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
సెప్టెంబర్ 30, 2021 : మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం చౌ దర్పల్లి పంచాయతీ కార్యదర్శి అనురాధ.. సీసీ రోడ్డు పనుల బిల్లులు చేసేందుకు కాంట్రాక్టర్ వద్ద రూ.20 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.
అక్టోబర్ 7, 2021 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాసిల్దార్ షౌకత్ అలీ, సిబ్బంది శివశంకర్, వీఆర్ఏ కృష్ణ ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తయిన ఏడు డాక్యుమెంట్లు ఇచ్చేందుకు రూ.12వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.
నవంబర్ 30, 2021 : నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపూర్ పంచాయతీ కార్యదర్శి సీహెచ్.రామస్వామి.. ఓ వ్యక్తి ఇంటి మ్యుటేషన్ కోసం రూ.5,500 లంచంగా తీసుకుంటూ చిక్కారు.
ఈ ఏడాది జనవరి 19న మరికల్ తాసిల్దార్ ఎస్.శ్రీధర్ వితంతువు భూమి మ్యుటేషన్ కోసం రూ.20 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు.
ఫిబ్రవరి 17, 2020 : మహబూబ్నగర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మహమ్మద్ వాజీద్ ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్నాడు. ఓ వ్యక్తికి చెందిన ఫుడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసేందుకు రూ.4 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
ఫిబ్రవరి 24, 2020 : నారాయణపేట జిల్లా చెన్నారెడ్డిపల్లి వీఆర్వో హెచ్.పద్మనాభ పట్టాదార్ పాస్బుక్ జారీ కోసం రూ.8 వేలు తీసుకుంటూ దొరికిపోయాడు.
మార్చి 6, 2020 : ఓ ఎక్సైజ్ కేసులో సీజ్ అయిన కారును రిలీజ్ చేసేందుకు అచ్చంపేట ఎక్సైజ్ కార్యాలయంలో చేసుకున్న దరఖాస్తును ఆ శాఖ డీసీకి ఫార్వర్డ్ చేసేందుకు స్థానిక ఎక్సైజ్ సీఐ శ్రవణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ దేవేందర్ నాయక్ రూ.9 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
జూలై 2, 2020 : కొందరికి చెందిన ఇన్సూరెన్స్ దరఖాస్తులు కార్మిక శాఖ డిఫ్యూటీ కమిషనర్కు ఫార్వర్డ్ చేసేందుకు రూ.6వేలు లంచం తీసుకుంటుండగా.. మహబూబ్నగర్ రెండో సర్కిల్కు చెందిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వాడ్రేవు కోటేశ్వర్ రావు ఏసీబీకి దొరికాడు.
జూలై 23, 2020 : వడ్డేపల్లిలో మెడికల్ ఆఫీసర్ లీవ్ దరఖాస్తును వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్కు ఫార్వర్డ్ చేసేందుకు సాక్షాత్తు జిల్లా వైద్యాధికారే లంచం ఆశించారు. అప్పటి డీఎంహెచ్వో కేతావత్ భీమ పబ్లిక్ హెల్త్ నర్స్ బ్యూల ద్వారా రూ.7 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఆగస్టు 6, 2020 : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరు వీఆర్వో నాయిని వెంకటరమణ ఓ రైతు భూమిని మ్యుటేషన్ చేసేందుకు రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.
ఆగస్టు 22, 2020 : మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ క్లోరినేషన్ కొటేషన్లను కలెక్టరేట్కు ఫార్వర్డ్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.1.65 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
నవంబర్ 4, 2020 : బాలానగర్ రెసిడెన్షియల్ పాఠశాల ఫీల్డ్ ఆఫీసర్ జి.విజయభాస్కర్ ఓ ఉద్యోగి పనితీరు సరిగా ఉందని ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపించేందుకు రూ.5వేలు తీసుకుంటూ దొరికిపోయారు.
నవంబర్ 27, 2020 : ఆగస్టు 22, 2020న లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అప్పటి మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్కు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని గుర్తించిన ఏసీబీ అధికారులు మరోమారు కేసు నమోదు చేశారు. రూ.3.91 కోట్లు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సంపాదించారు. ప్లాట్లు, నగదు, బంగారం పట్టుబడింది. సురేందర్ తన జీతానికి మించి 202 శాతం అక్రమంగా కూడబెట్టినట్లుగా నిర్ధారించారు.
మార్చి 3, 2021 : మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మత్స్యశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గంగారాం మత్స్య సహకార సొసైటీ సభ్యుల స్కిల్ టెస్టు పాస్ చేసేందుకు రూ.45వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
ఏప్రిల్ 4, 2021 : క్వారీ లీజు ఎన్వోసీ సర్టిఫికెట్ను మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్కు ఫార్వర్డ్ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలను వెల్దండ తాసిల్దార్ జి.సైదులు.. కె.వెంకటయ్యతో లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం సొమ్ము ఏసీబీకి చిక్కకుండా చేసేందుకు వెంకటయ్య పొయ్యిలో వేసి కాల్చేశాడు. అయినా, సాంకేతిక ఆధారాలతో అవినీతి అధికారిని, సహకరించిన వ్యక్తిని అధికారులు కటకటాల పాలు చేశారు.
ఏప్రిల్ 4, 2021 : రేవల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్ హరున్ రషీద్, టెక్నికల్ అసిస్టెంట్ కె.చిన్న బంగారయ్య.. ఉపాధిహామీలో పనులు చే సిన పశువుల కొట్టం బిల్లు చేసేందుకు రూ.4 వేలు తీసుకుంటూ దొరికిపోయారు.
జూన్ 6, 2021 : అటవీ శాఖకు మొక్కలు పంపిణీ చేసిన కాంట్రాక్టర్కు బిల్లు చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేసిన వనపర్తి, జోగుళాంబ గద్వాల డీఎఫ్వో మాగంటి బాబ్జీరావు రూ.3 లక్షలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
సెప్టెంబర్ 22, 2021 : జోగుళాంబ గద్వాల జిల్లా ఐకేపీ సర్వేయర్ హెచ్. తిక్కయ్య.. ఓ రైతుకు సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు. రూ.20వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
సెప్టెంబర్ 30, 2021 : మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం చౌ దర్పల్లి పంచాయతీ కార్యదర్శి అనురాధ.. సీసీ రోడ్డు పనుల బిల్లులు చేసేందుకు కాంట్రాక్టర్ వద్ద రూ.20 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.
అక్టోబర్ 7, 2021 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాసిల్దార్ షౌకత్ అలీ, సిబ్బంది శివశంకర్, వీఆర్ఏ కృష్ణ ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తయిన ఏడు డాక్యుమెంట్లు ఇచ్చేందుకు రూ.12వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.
నవంబర్ 30, 2021 : నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపూర్ పంచాయతీ కార్యదర్శి సీహెచ్.రామస్వామి.. ఓ వ్యక్తి ఇంటి మ్యుటేషన్ కోసం రూ.5,500 లంచంగా తీసుకుంటూ చిక్కారు.
ఈ ఏడాది జనవరి 19న మరికల్ తాసిల్దార్ ఎస్.శ్రీధర్ వితంతువు భూమి మ్యుటేషన్ కోసం రూ.20 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు.