సుల్తాన్బజార్ : హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నఠాకూర్ రాజ్కుమార్ సింగ్పై చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళలు హెచ్చార్సీని ఆశ్రయించారు.
ట్రస్ట్ బోర్డు పెట్టుకొని ఉల్లంఘనలకు పాల్పడటమే కాకుండా తండా ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్న ఠాకూర్ రాజ్కుమార్ సింగ్పై తగిన చర్యలు తీసుకోవాలని గురువారం సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ మండలం ఐలాపురం తండా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పిటీషన్ దాఖలు చేశారు.
ఈ సంధర్భంగా ఐలాపురం గ్రామ తండా మాజీ సర్పంచ్ ఇస్లావత్ రవితో కలిసి తండా ప్రజలు కార్యలయానికి రావడంతో కమిషన్ నాన్ జ్యుడీషీయరీ సభ్యులు మహ్మద్ ఇర్ఫాన్ మోయినుద్దీన్ భయటకు వచ్చి తండా ప్రజలతో మాట్లాడారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని హామినిచ్చారు. అతనిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.