షేక్పేట్ : ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషి చేస్తున్నామని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. సోమవారం షేక్పేట్ డివిజన్ సబ్జా కాలనీలో 4లక్షల 50 వేల రూపాయలతో నిర్మించనున్న సివరేజిలైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జలమండలి జీఎం మాణిక్యంతో కలిసి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ ప్రజలకు మౌలికసదుపాయాలను కల్పించడానికి ఆయా శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం మాణిక్యం, డీజీఎం జవహర్ అలీ, మేనేజర్ మురళీధర్,టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దుర్గం ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్,సజ్జాద్ స్సేన్,రఫియా,మధూ తదితరులు పాల్గొన్నారు.