మామిళ్లగూడెం/ సత్తుపల్లి, జనవరి 17: సంక్రాంతి పర్వదినం అనంతరం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్రావు, పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా, బొకేలతో వారిని సత్కరించారు. సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన కొత్తూరు ఉమామహేశ్వరరావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఈనెల 23న ప్రమాణ స్వీకారం పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరుకావాలని వారిని ఆహ్వానించారు. అనంతరం జిల్లా గ్రంథాయల సంస్థ మాజీ చైర్మన్ ఎండీ ఖమర్ను కూడా మర్యాద పూర్వకంగా కలిశారు. సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ సత్తుపల్లి పట్టణ కార్యదర్శి మల్లూరు అంకమరాజు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వనమా వాసు, పవన్, చాంద్పాషా తదితరులు పాల్గొన్నారు. తొలుత, సత్తుపల్లి నియోజకవర్గ సమస్యలన త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే సండ్ర ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు.
మిర్చి రైతులను ఆదుకోవాలి
తామర పురుగు, అకాల వర్షం వంటి కారణాల వల్ల జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలెక్టర్ వీపీ గౌతమ్ను కోరారు. వ్యవసాయ శాఖ ద్వారా నష్టాన్ని అంచనా వేయించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని సూచించారు. మిర్చి రైతుల నష్టాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.