మణికొండ : పేద ప్రజల పక్షాన ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరంగా చిరస్థాయిలో నిలిచి ఉంటుందని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు.
సోమవారం నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన తాండ్ర ఎల్లయ్య కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక నాయకులు మాజీ ఎంపీపీ మల్లేష్, మాజీసర్పంచ్ ఆర్.నర్సింహ్మ, సింగిల్ విండో డైరెక్టర్ టి.క్రిష్ణలతో కలిసి రూ.లక్షా 20వేల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి అన్నివర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది మంది కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించి వారి ఆదుకున్నా మని గుర్తుచేశారు.
ఆసుపత్రుల పాలైన కుటుంబసభ్యులు తమ ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని సీఎంఆర్ఎఫ్ నిధికి దరఖాస్తులు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భాధిత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.