గోల్నాక : ఆనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆపదలో ముఖ్యమంత్రి సహాయనిథి అండగా నిలుస్తోందని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.
గోల్నాకకు చెందిన యాకమ్మకు రూ.40వేలు, పటేల్నగర్కు చెందిన ఆర్.వినయ్గౌడ్కు రూ.28వేలు, బాగ్అంబర్పేట కు చెందిన విష్ణువర్ధన్కు రూ, 24వేలు, ఆకాశ్నగర్కు చెందిన సర్వీర్బీకి రూ.60వేలు, ఘట్కేసర్కు చెందిన కె.కిశోర్కు రూ. 60వేలు, మలక్పేటకు చెందిన ఉషానాకు రూ.18వేలు, మల్లికార్జుననగర్కు చెందిన దస్తయ్యకు రూ. 12వేలు, ఖాద్రీబాగ్కు చెందిన అరుణ్కు రూ.60వేల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.