గోల్నాక : వివిధ రకాల వ్యాధుల భారిన పడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
మంగళవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్ దవఖానాలో చికిత్స పొందుతున్న అంబర్పేట డివిజన్ సీపీఎల్కు చెందిన కె.రమేష్కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.4లక్షల విలువగల ఆమోదపత్రాన్నిబాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు.