జూబ్లీహిల్స్ : జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలలో కోట్లవిజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియం చిన్నారులు సత్తా చాటారు. యూసుఫ్గూడ కెవీబీఆర్ స్టేడియంలో కోచ్ శ్రీకాంత్ యాదవ్ వద్ద శిక్షణ పొందుతున్న క్రీడాకారులు 4 బంగారు పతకాలు సాధించారు.
నగరంలోని బేగంబజార్లో నిర్వహించిన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో సాయి రోషిణి, లోచిత, హరిప్రియ, దేవిప్రియలు ఆయా విభాగాలలో ప్రథమ స్థానాలలో నిలిచి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. సోమ వారం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో చిన్నారులకు మెడల్స్తో పాటు సర్టిఫికెట్లు అందజేసినట్లు కోచ్ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు.