బడంగ్పేట: ప్రతిఒక్కరూ సేవా దృక్పథాన్నిఅలవర్చుకుంటే సమాజంలో మార్పు వస్తుందని మహేశ్వరం నియోజక వర్గం టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్చార్జీ , కేఎంఆర్ ట్రస్టు చైర్మన్ కొత్త మనోహర్రెడ్డి అన్నారు. కరోనా మూలంగా ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కుంటున్న జిల్లెలగూడ దాసరి నారాయణ రావు కాలనీ వాసులకు కేఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆయన నిత్యవసర వస్తువులు అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా కరోన భారిన పడి ఇబ్బంది పడుతున్నవారికి తప్పని సరిగా సహకారం అందిస్తామని ఆయన అన్నారు. ప్రతి రోజు ఒక కాలనీ ఎంచుకొని కొవిడ్ బాధితులకు సహాయం చేస్తున్నామని ఆయన అన్నారు. గత పది సంవత్సరాల నుంచి కేఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఎంతో మందికి పుస్తే మట్టెలు, కుట్టు మిషన్లు, నిత్యవసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, మహేందర్, అంజి, హరి, పవన్ తదితరులు ఉన్నారు.