కామారెడ్డి, జనవరి 21 : కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కె.చంద్రమోహన్ను నియమిస్తు చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఎస్జీడీసీ అడ్మిన్స్ట్రేటర్గా ఉన్న చంద్రమోహన్ను కామారెడ్డి అదనపు జిల్లా కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట మాధవరావు ఇన్చార్జి అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తించగా, కొద్దిరోజుల క్రితం ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించడంతో ఆయన పీడీగా కొనసాగుతున్నారు. చంద్రమోహన్ రాకతో అదనపు కలెక్టర్ పోస్టు భర్తీ అయ్యింది.