కాచిగూడ : కాచిగూడ రైల్వేస్టేషన్ వెయిటింగ్ హాల్లో నగదు, క్రెడిట్, డెబిట్ కార్డుల బ్యాగు మాయమైంది. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నంలోని లింగాలతోటకు చెందిన అకౌంటెంట్ దేవత సూర్యప్రకాశ్రావు (46) సోమవారం కాచిగూడ రైల్వేస్టేషన్లో రైలు దిగాడు.
అక్కడే వెయిటింగ్ హాల్లో స్నానం చేసేందుకు వెళ్లాడు. ఆదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు ఆతని బ్యాగులోంచి రూ.20 వేల రూపాయలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఖరీదైన సెల్ఫోన్ను దొంగిలించారు. సోమవారం ఆతను కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ బీజీ ప్రసాద్ తెలిపారు.