ఖలీల్వాడి/విద్యానగర్, జనవరి 19 : ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు భయపెడుతున్నాయి. బుధవారం 567 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 435 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 57,818 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో 515 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 132 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 32,358 కేసులు నమోదైనట్లు వివరించారు. కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.