అంబర్పేట : అంబర్పేట మహంకాళి టెంపుల్కు ఎలాంటి నష్టం కలుగకుండా ఫ్లైఓవర్ నిర్మాణం పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం మహంకాళి ఆలయం ఆవరణలో కార్పొరేటర్లు బి.పద్మవెంకటరెడ్డి, ఇ.విజయ్కుమార్గౌడ్, వివిధ విభాగాల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయం పక్కన నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వేసే ఫిల్లర్లు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నిర్మించాలని కోరారు. ఆలయానికి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్లు పి.జ్ఞానేశ్వర్గౌడ్, కె.పద్మావతి, ఎస్.ఈ. ధర్మారెడ్డి, టౌన్ప్లానింగ్ ఏసీపీ సాయిబాబా, వాటర్వర్క్ డీజీఎం సతీష్, ఏఈ మజీద్, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, ఏఈలు ఫరీద్, ప్రేరణ, శ్వేత, సౌమ్య, డీప్యూటీ ఈఈ తదితరులు పాల్గొన్నారు.