బడంగ్పేట : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుంటే బీజేపీ నాయకులు కండ్లు లేని కబోదులుగా వ్యవహరిస్తు అభివృద్ధి జరగటం లేదని చెప్పడం విడ్డూరమని మాజీ వైస్ చైర్మన్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్, మాజీ ఎంపీటీసీ సంరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు.
బడంగ్పేటలోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వందల కోట్ల రూపాయలతో రోడ్లు, మంచి నీటి పైపులైన్స్, డ్రైనేజీ పైపులైన్స్ వంటి పనులు వేగ వంతంగా జరుగుతున్నా బీజేపీ నాయకులకు కన్పించడం లేదన్నారు. మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.
టీఆర్ఎస్ యువనాయకుడు కార్తీక్ రెడ్డి పై అసత్య ప్రచారాలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. రూ.20 కోట్లతో బడంగ్పేట నుంచి నాదర్గుల్ వరకు అవుతున్న రోడ్డ విస్తరణ పనులు కన్పించడం లేదా అన్ని వారు ప్రశ్నించారు. అభివృద్ధి కోసం మాత్రమే మంత్రి పార్టీ మారారని వారు గుర్తు చేశారు.
చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, నాలాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లు కేటాయించిందన్నారు. వాస్తవాలను గ్రహించ కుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి అవుతుందో లేదో బీజేపీ కార్పొరేటర్స్ ను ఆ పార్టీ నాయకులు అడగాలన్నారు.
నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూస్తు ఊరుకోమన్నారు. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మంత్రులను విమర్శించే స్థాయి బీజేపీ నాయకులకు లేదన్నారు. ఇక నుంచి బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులపైగాని, కార్పొరేటర్స్ పైగాని దాడులకు ప్పాలడితే ప్రతి దాడి తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ పెద్ద బావి శ్రీనివాసరెడ్డి, ఏనుగు రాంరెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మరి జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పెద్ద బావి ఆనంద్రెడ్డి , లిక్కి కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రాజ్, జనిగ శ్రీనివాస్ యాదవ్, బోయపల్లి శేఖర్రెడ్డి తదితరులు ఉన్నారు.
మీర్పేటలో…
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి రూ.127 కోట్ల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేశారని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజక వర్గం అభివృద్ధి కోసం మంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని వారు అన్నారు.
మీర్పేటలో ఉన్న మూడు చెరువులను సుందరీకరణ చేస్తుంటే బీజేపీ నాయకులకు ఎందుకు కన్పించడం లేదో అర్ధం కావడం లేదన్నారు చెరువులను అనుసందానం చేస్తు రూ.45 కోట్లతో నాలాల అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ నాయకులకు ఆరోపణలు తప్ప అభివృద్ధి గురించి తెలియదన్నారు.
ట్రంక్లైన్ ఏర్పాటుకు రూ.23 కోట్లు, మీర్పేట పెద్ద చెరువు అభివృద్ధికి రూ.7కోట్లు, ప్రశాంత్ హిల్స్ నుంచి నంది హిల్స్ వరకు రూ.4కోట్లతో రోడ్డు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి క్రిష్ణా వాటర్ సరఫరా చేయడానికి పైపులైన్ పనులు జరుగుతున్నామయని వారు గుర్తు చేశారు.
అభివృద్ధి నిరోధకులుగా బీజేపీ నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్ నరేంద్రకుమార్, దీప్లాల్ నాయక్, శ్రీనివాస్ నాయక్, దిండు భూపేష్ గౌడ్, జోజి, రాకేష్ తదితరులు ఉన్నారు.