60కి 60స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో చేరాలి
అభివద్ధికి నిధులు తెచ్చే బాధ్యత నాది
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం నగరంలోని 4,6,7 డివిజన్లలో ఎన్నికల ప్రచారం
రఘునాథపాలెం, ఏప్రిల్ 20 : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపుతో చరిత్ర సృష్టించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆయన 4,6,7డివిజన్లలో ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఆయా డివిజన్లలోని టేకులపల్లి, లక్ష్మీనగర్, ఖానాపురం, ప్రశాంతినగర్, ఇండస్రియల్ ఏరియా, యూపీహెచ్ కాలనీ పురవీధుల గుండా ప్రచారరథంపై తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఖానాపురం, యూపీహెచ్ కాలనీల్లో ఓటర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు గెలుపు అవకాశం ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ విజయ దుంధుభి మోగించాలన్నారు. ఇప్పటికే జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని బలమైన రాజకీయ పార్టీగా అవతరించిందన్నారు. కార్పొరేషన్లోని 60కి 60స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. కార్పొరేషన్ సమగ్రాభివృద్ధికి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత నాదేనని మంత్రి నేతలకు భరోసానిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, ఖమ్మం నగర అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు అన్ని డివిజన్ల నుంచి వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్ గూటికి చేరేందుకు క్యూ కడుతున్నట్లు పేర్కొన్నారు.
పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. ఆయన అడుగుజాడల్లో మనమంతా పని చేసి పార్టీ అభ్యున్నతికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా డివిజన్ ప్రజలతో పాటు నేతలు నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. 4వ డివిజన్ అభ్యర్థిగా దండా జ్యోతిరెడ్డి, 6వ డివిజన్ అభ్యర్థిగా నాగండ్ల కోటేశ్వరరావు, 7వ డివిజన్ అభ్యర్థిగా లింగనబోయిన లక్ష్మణ్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్, మాజీ ఎంపీపీ దొంగల ఇందిర, మాజీ కార్పొరేటర్ ఆత్కూరి హనుమాన్, 7వ డివిజన్ నాయకులు చిలకల వెంకటనర్సయ్య, దొంగల తిరుపతిరావు, పొదిల పాపారావు, చిలకల వెంకటేశ్వర్లు, తిప్పట్ల నర్సింహారావు, 6వ డివిజన్లో పంతంగి వెంకటేశ్వర్లు, వడ్డే ప్రసాద్, తాతా ప్రసాద్, మంద ఉపేందర్, 4వ డివిజన్ వంటికొమ్ము శ్రీనివాస్రెడ్డి, యల్లంపల్లి హనుమంతరావు, కంచర్ల దయాకర్ పాల్గొన్నారు.