గ్రామీణ ప్రాంత వైద్యం మెరుగైంది. ఎర్ర గోలి, పచ్చ గోలి నుంచి రోగాల నిర్ధారణకు ప్రత్యేక పరీక్షలు చేసే స్థాయికి దవాఖానల్లో వసతులు రూపుదిద్దుకున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తూ 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారాయి. ఇందులోనే ఈసీజీ, ఎక్స్ రే, స్కానింగ్, ఆపరేషన్ థియేటర్ వంటి అత్యాధునిక సేవలతోపాటు గైనకాలజిస్ట్, సర్జన్, అనస్తీషియా వంటి ప్రత్యేక సేవలు కూడా స్థానికులకు అందుబాటులోకి రానున్నాయి. 24గంటల వైద్య సేవలు అందనున్నాయి. ఈమేరకు బాలానగర్, కోయిలకొండ సీహెచ్సీలను మంగళవారం మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించనున్నారు.
మహబూబ్నగర్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలకేంద్రంలో 120 ఏండ్ల కిందట నిజాం పాలనలో నిర్మించిన దవాఖానలోనే వైద్య సేవలందించారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఈ దవాఖాన గురించి సమైక్య పాలనలో మన నేతలెవ్వరూ పట్టించుకోలేదు. సమైక్య ప్రభుత్వా లు శీతకన్ను వేశాయి. ఇక హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న బాలానగర్ పీ హెచ్సీ పరిస్థితి కూడా అంతే. ఇన్నాళ్లూ కోయిలకొండ మండల ప్రజలు మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ వెళ్లాల్సి వస్తే.. బాలానగర్ ప్రజ లు షాద్నగర్ లేదా బాదేపల్లికి వెళ్లేవారు. ఇక వారి సమస్యలకు ప్రభుత్వం చరమగీతం పా డింది. ఈ రెండు మండల కేంద్రాల్లో 30 పడకల చొప్పున క మ్యూనిటీ హెల్త్ సెంటర్లను నిర్మించింది. బాలానగర్లో రూ.4.7కోట్లు, కోయిలకొండలో రూ.5 కోట్ల వ్యయంతో ద వాఖానలను నిర్మించినట్లు డీఎంహెచ్వో కృష్ణ తెలిపారు. ప్ర స్తుతం ఉన్న పీహెచ్సీలలో కేవలం ఓపీ సేవలు తప్పా మరేవీ అందుబాటులో ఉండేది కాదు. కానీ 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటుతో ఈసీజీ, ఎక్స్రే, స్కానింగ్, ఆపరేషన్ థియేటర్ వంటి అత్యాధునిక సేవలతోపాటు గైనకాలజిస్ట్, సర్జన్, అనస్థీషియా వంటి ప్రత్యేక సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ దవాఖానల్లో వైద్యాధికారి, స్టాఫ్ నర్స్ మాత్రమే ఉండగా.. వైద్య సిబ్బంది సంఖ్య కూడా పెరుగుతుంది. 24 గంటలపాటు వైద్య సేవలు అందనున్నాయి. ఇక కోయిలకొండ మండలకేంద్రంలోని సీహెచ్సీని త్వరలోనే 50 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో కోయిలకొండ సమీపంలోని 60 తండాలు, 50 గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. బాలానగర్లో ఏర్పాటు చేస్తున్న సీహెచ్సీతో సమీపంలోని సుమా రు 65కు పైగా తండాలు, 50కు పైగా గ్రామ పంచాయతీలకు వైద్య సేవలందనున్నాయి. జాతీయ రహదారిపై ప్రమాదాల్లో గాయపడే వారికి వెంటనే చికిత్స అందించే వీలుంటుంది. బాలానగర్ సీహెచ్సీని సైతం భవిష్యత్లో మరింతగా అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే డా.సి.లక్ష్మారెడ్డి తెలిపారు.
నేడు మంత్రి హరీశ్రావు పర్యటన..
బాలానగర్ మండలకేంద్రంలో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే డా.సి.లక్ష్మారెడ్డితో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా మహబూబ్నగర్ చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం తరువాత మధ్యాహ్నం 1:30 గంటలకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి కోయిలకొండ సీహెచ్సీని ప్రారంభిస్తారు. అనంతరం మహబూబ్నగర్లో 3:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. ప్రస్తుతం దేశమంతా కొవిడ్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించనున్నట్లు సమాచారం.
దవాఖానలో అధునాతన వసతులు..
నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చే స్తున్నది. కోయిలకొండలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కృషితో అధునాతన వసతులతో దవాఖాన నిర్మించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందనున్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికులకు కార్పొరేట్ వైద్యం అందనున్నది. – ఎన్.శశికళ, ఎంపీపీ, కోయిలకొండ
దశ మారింది..
120 ఏండ్ల కిందట కోయిలకొండలో ప్రారంభించిన దవాఖానకు తెలంగాణ ప్రభుత్వంలో దశ మారింది. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కృషితో రూ.5 కోట్లతో అధునాతన దవాఖాన నిర్మించా రు. కోయిలకొండ సమీపంలోని 60 తండాలు, 50 గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.