వనస్థలిపురం : ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. వనస్థలిపురంలో ఎస్ఎన్ఆర్ జుడో ఫీట్నెస్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ లచ్చిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ కరాటే, జూడో, మార్షల్ ఆర్ట్ శారీరక, మానసిక దృఢత్వాన్నిస్తాయన్నారు. పిల్లలకు నేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకురావాలని సూచించారు.