రవీంద్రభారతి : ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులాల జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద వేలాది మంది బీసీలతో ’బీసీల జంగ్ సైరన్’’ పేరుతో ఆందోళన నిర్వహిస్తున్నట్లు బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్గౌడ్ తెలిపారు.
ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ చౌరస్తా వద్ద కరపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుండి బీసీలు జంగ్ సైరన్ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల29న జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీల జనగణనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి పెంచి పార్లమెంట్లో చర్చ జరిగేలా ఓబీసీ పార్లమెంట్ సభ్యులు పట్టుపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ నెల 14న కేంద్ర మంత్రుల ఇండ్ల ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.మూడు రోజుల పాటు జరిగే ఈ ఆందోళన కార్యక్రమాలను బీసీశ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని విక్రమ్గౌడ్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్కుర్మా, విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్కచెర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు నరేష్ ప్రజాప్రతినిధి,ఈడిగా నాగరాజుగౌడ్, చందు, సాయిపటైల్, రాజేష్, బీసీ విద్యార్థి యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.