శంషాబాద్ : అంకితభావంతో పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. మంగళవారం నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ దూడల వెంకటేశ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డు టీఆర్ఎస్ నూతన కమిటీ ప్రతినిధులకు నియామక పత్రాలు ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.
కమిటీ నూతన అధ్యక్షుడుగా ఏ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులుగా రమాదేవి, మహెందర్రెడ్డి, అంజద్, నరేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బి.శివకుమార్ గౌడ్, కార్యదర్శులుగా మహేష్, శ్రీపాల్రెడ్డి, రాజేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా రుష్వేందర్ రెడ్డి, మతీన్, నర్సింగ్రావు, ఎక్బాల్, శివప్రసాద్, అభిషేక్ గౌడ్, ఆరిఫ్ అలి, నరేష్, నరేందర్ రెడ్డిలు నియమితులైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, మహెందర్రెడ్డి, మాజీ సర్పంచ్ గణేష్గుప్త, వేణుమాధవరెడ్డి, వీరేందర్రెడ్డి, అస్లాంతో పాటు పలువురు పాల్గొన్నారు.