ఆర్కేపురం : నేషనల్ జూనియర్ లెవెల్ ఉమెన్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్ షిప్ పోటీలకు సరూర్నగర్ డివిజన్కు చెందిన చెరుకూరి ఆనంద్ కీర్తి ఎంపికయ్యారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్ పోటీల్లో ఆనంద్ కీర్తి అత్యంత ప్రతిభ కనబర్చి నేషనల్ జూనియర్ లెవెల్ ఉమెన్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్కు ఛాంపియన్ షిప్ పోటీలకు ఎన్నికైంది.
ఈ సందర్భంగా కోచ్లు చంద్రకాంతరావు, స్వర్ణలత మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 26 వరకు జమ్మూ కాశ్మీర్లో జరిగే పోటీల్లో ఆనంద్ కీర్తి పాల్గొననున్నదని తెలిపారు. జిమ్నా స్టిక్ విభాగంలో రాష్ట్రం నుంచి మొత్తం నలుగురు ఎంపికకాగా, మహిళా విభాగంలో కీర్తి ఎంపికయ్యారని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ జూనియర్ లెవెల్ పోటీల్లో రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.