మైలార్దేవ్పల్లి :గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శాస్ర్తీపురం డివిజన్ పరిధిలోని నేషనల్ పోలీస్ అకాడమీ సమీపంలో చెట్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తి (45) మృతదేహం ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు.