బన్సీలాల్పేట్ : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఎంతో గొప్పవని, ఉన్నతమైన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్అన్నారు. అంబేద్కర్ 65వ వర్థంతి సందర్భంగా బన్సీలాల్పేట్లోని అంబేద్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన నివాళిలర్పించారు.
బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కే.హేమలత, టీఆర్ఎస్ నాయకులు కే.లక్ష్మిపతి, ప్రేమ్కుమార్, విజయ్శంకర్,కేఎమ్.కృష్ణ, సాయిబాబ, రాజేందర్, వినయ్, ఎస్సీఆర్పీఎస్ నాయకులు డి.సుదర్శన్బాబు, కె.మహేందర్, అశోక్, కరుణాకర్, గోవర్థన్లు పాల్గొన్నారు.