మియాపూర్ : బాబా సాహెబ్ అంబేద్కర్ 65 వ వర్థంతిని పురస్కరించుకుని వివేకానందనగర్లోని తన నివాసంతో పాటు మియాపూర్ మక్తా గ్రామంలో అంబేద్కర్ చిత్ర పటానికి , కాంస్య విగ్రహానికి కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు రాజ్యాంగ రచయితగా దేశంలో ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకునే బాటను చూపారన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, రఘునాథ్రెడ్డి, సంజీవరెడ్డి, లక్ష్మీనారాయణ, కిరణ్యాదవ్, రవీందర్రెడ్డి,మాచర్ల భద్రయ్య, మోజెస్,హరినాథ్, ఆంజనేయులు, ఇబ్రహీం, సాలయ్య,రాములు, మధు, భారతమ్మ, జీతయ్య, నాగరాజు, నర్సింగ్రావు, శ్రీధర్,రాజేశ్, భిక్షపతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.