2022-23 విద్యా సంవత్సరానికి గాను మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది బాలుర, ఏడు బాలికల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రవేశం కోసం 3,246 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,016 మంది హాజరయ్యారు. 1,230 మంది గైర్హాజరయ్యారు.
ఎదులాపురం/ నిర్మల్ టౌన్, మే 15 : మైనార్టీ గురుకుల పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కృష్ణవే ణి తెలిపారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థు లు గంట ముందుగానే చేరుకున్నారు. వారి కి థర్మల్ స్క్రీనింగ్ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడ మైనార్టీ గురుకుల పరీక్షా కేం ద్రాన్ని జిల్లా సంక్షేమశాఖ అధికారి తనిఖీ చేశారు. అక్కడ సౌకర్యాలను పరిశీలించా రు. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడు తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ గురుకుల విద్యార్థుల కోసం కార్పొరేట్ స్థా యి విద్యను అందిస్తున్నదని పేర్కొన్నారు.
ఒక్కో విద్యార్ధిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా 10 బాలుర, ఏడు బాలికల గురుకు ల పాఠశాలలున్నాయని తెలిపారు. ఇందు లో ఆదిలాబాద్లో 6, నిర్మల్లో 4, ఆసిఫాబాద్లో 3, మంచిర్యాల జిల్లాలో మూడు గురుకులాల్లో ఐదో తరగతిలో ప్ర వేశం కోసం 3,246 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.
ఇం దులో 2,016 మంది విద్యార్థులు పరీక్ష రా యగా.. 1230 మంది గైర్హాజరయ్యారని తె లిపారు. బంగారిగూడ గురుకుల ప్రిన్సిపా ల్ రజిని, వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. నిర్మల్లో మొత్తం 215 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 140 మంది హా జరుకాగా.. 75 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ పల్లవి తెలిపారు. బాలుర ఉన్నత పాఠశాలలో ప్ర వేశ పరీక్షకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరైనట్లు ఆ పాఠశాల అధికారులు తెలిపారు.