మామడ, మే 14 : రోడ్డు విస్తరణ పనులను వేగిరం చేయాలని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. లక్ష్మణచాంద మండలం కనకపూర్ నుంచి ఖానాపూర్ పట్టణ శివారు వరకు 61వ జాతీయ రహదారిపై చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను శనివారం మామడ సమీపంలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పూర్తయ్యే వరకు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాకాల చంద్రశేఖర్గౌడ్, సామ వికాస్రెడ్డి పాల్గొన్నారు.
మండల కేంద్రానికి చెందిన ఏలేటి గంగారెడ్డి మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. వారి కుటుంబ సభ్యులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరామర్శించారు. మృతికి కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట సర్పంచ్ హన్మాగౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, నాయకులు భాస్కర్రావు, లింగారెడ్డి, వికాస్రెడ్డి, మేకం అశోక్ ఉన్నారు.
నిర్మల్ అర్బన్, మే 14 : మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తున్నదని రాష్ట్ర మంత్రి అల్లోల ఇం ద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని రాం రావ్బాగ్ కాలనీకి చెందిన డ్వాక్రా మహిళా సంఘ సభ్యులు శనివారం మంత్రి క్యాంపు కా ర్యాలయంలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా 300 మంది మహిళల కోసం జాబిలమ్మ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.10 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే శంకుస్థాపన చేస్తానని తెలిపా రు. నిధులు మంజూరు చేసిన మంత్రికి కాలనీ వా సులు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నాయకులు ఆదుముళ్ల పద్మాకర్, రాజేశ్వర్ తదితరులున్నారు.