బాసర, మే 9 : బాసరలోని పురాతన దీప స్తం భాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దానిపైన ఉన్న రాతిశిలను ఎత్తుకెళ్లారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పురాతన శివాలయమైన పాపహరేశ్వర ఆలయంలో గల దీప స్తంభాన్ని కొందరు దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. దానిపై గల రాతిశిలలను ఎత్తుకెళ్లారు. విష యం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టా రు.
రాతి శిలను ధ్వంసం చేసింది ఎవరు? ఎం దుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? అనే కో ణాల్లో సోమవారం భైంసా ఇన్చార్జి అదనపు ఎ స్పీ జీవన్రెడ్డి, ముథోల్ సీఐ వినోద్రెడ్డి, ఎస్ఐ మ హేశ్ దర్యాప్తు చేశారు. కాగా, ఎత్తుకెళ్లిన రాతిశిలలు బి ద్రెల్లి గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి పశువుల పాకలో దొరకడం పలు అనుమానాలకు తా విస్తున్నది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి అదనపు ఎస్పీ జీవన్రెడ్డి తెలిపారు.