యాదగిరిగుట్ట రూరల్, జనవరి 17 : జిల్లా వ్యాప్తంగా పలువురు తాసీల్దార్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్ట తాసీల్దార్గా రాము బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇతను మోటకొండూరు తాసీల్దార్గా, అంతకు ముందు సెక్రటేరియట్లో సెక్షన్ అధికారిగా పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో పని చేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు.
రాజాపేట తాసీల్దార్గా గిరిధర్
రాజాపేట : మండల తాసీల్దార్గా గిరిధర్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ తాసీల్దార్గా పని చేసిన జయమ్మ ఆత్మకూర్(ఎం)కు బదిలీ అయ్యారు. నూతన తాసీల్దార్ గిరిధర్ను ఎంఈఎఫ్ మండల కన్వీనర్ ఇంజ మహేశ్, నాయకులు, సమ్మయ్య, రెవెన్యూ సిబ్బంది సన్మానించారు.
బీబీనగర్ తాసీల్దార్గా అశోక్రెడ్డి
బీబీనగర్ : కొత్త తాసీల్దార్గా వై.అశోక్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన కె.వెంకట్రెడ్డి భువనగిరి మండలానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో యాదగిరిగుట్ట మండలంలో పని చేసిన అశోక్రెడ్డి ఇక్కడికి వచ్చారు.
వలిగొండ తాసీల్దార్గా శ్యాంసుందర్రెడ్డి
వలిగొండ : మండల తాసీల్దార్గా శ్యాంసుందర్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఆత్మకూర్(ఎం)తాసీల్దార్గా జయమ్మ
ఆత్మకూరు(ఎం) : కొత్త తాసీల్దార్గా మందుల జయమ్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన జ్యోతిని, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జయమ్మను తాసీల్దార్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ ఉద్యోగులు సన్మానించారు. ఎంపీపీ తండ మంగమ్మాశ్రీశైలంగౌడ్, జడ్పీటీసీ కె.నరేందర్గుప్తా, సర్పంచ్ నగేశ్, ఎంపీటీసీ కవిత, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు బాషబోయిన ఉప్పలయ్య, ఆర్ఐ యాదగిరి, ఉద్యోగులు పాల్గొన్నారు.
మోటకొండూర్ తాసీల్దార్గా జ్యోతి
మోటకొండూర్ : నూతన తాసీల్దార్గా జ్యోతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇప్పటి వరకు ఆత్మకూరు(ఎం) మండల తాసీల్దార్గా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. బాధ్యతలు స్వీకరించిన జ్యోతిని కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు సన్మానించారు. సన్మానించిన వారిలో డిప్యూటీ తాసీల్దార్ శేఖర్, జూనియర్ అసిస్టెంట్ హరి, వీఆర్వోలు వెంకటేశ్, గుర్రాల బాలకృష్ణ, యాదగిరి, పరమేశ్ ఉన్నారు.
గుండాల తాసీల్దార్గా శ్రీనివాస్రాజు
గుండాల : కొత్త తాసీల్దార్గా సీహెచ్ శ్రీనివాస్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేసి మండల ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. శ్రీనివాసరాజు గతంలో కలెక్టరేట్లో పనిచేశారు.
చౌటుప్పల్ తాసీల్దార్గా దశరథ
చౌటుప్పల్ రూరల్ : మండల తాసీల్దార్గా జి.దశరథ బాధ్యతలు చేపట్టారు. బదిలీల్లో భాగంగా ఆయన భూదాన్పోచంపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన శ్రీనివాస్ కుమార్ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు.
భువనగిరి తాసీల్దార్గా వెంకట్రెడ్డి
భువనగిరి అర్బన్ : భువనగిరి తాసీల్దార్గా కొప్పుల వెంకట్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. టీఆర్ఎస్ నాయకుడు లాయక్ అహ్మద్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో తాసీల్దార్ను సన్మానించారు.