కొండాపూర్ : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2022 -24 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సుకు దరఖాస్తులను స్వీకరణ ప్రారంభమైనట్లు వర్సిటీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
యూజీసీ నుంచి ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అవార్డు పొందడంతో పాటు దేశంలోని వర్సిటీల్లో 9వ ర్యాంకులో హెచ్సీయూ ఉందని, 2 సంవత్సరాల కోర్సుకు 1.6 లక్షల ట్యూషన్ ఫీజుతో ఉత్తమ బోధన, ప్రాంగణ నియమాకాలతో ఉత్తమ ఫలితాలను అందిస్తుందన్నారు.
ఈ విద్యా సంవత్సరానికి 75 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, 2021 క్యాట్ స్కోర్ ఆధారంగా నియామకం జరుగుతుందని, ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ 15వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీగా తెలిపారు.