తూప్రాన్/రామాయంపేట, జనవరి 21 : జ్వర సర్వేను వైద్య సిబ్బంది పక్కాగా చేపట్టాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. శుక్రవారం ఆరోగ్య జ్వర సర్వేలో భాగంగా తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని ఘనపురం, హైదర్గూడ గ్రామాల్లో అదనపు కలెక్టర్ పర్యటించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న జ్వర సర్వే వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు డోస్ల టీకా వేసుకుని 9 నెలలు గడిచిన వారికి బూస్టర్ డోస్ టీకా వేయాలని సూచించారు. గ్రామస్తుల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఆయన వెంట తూప్రాన్, మనోహరాబాద్ వైద్య సిబ్బంది, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్, కమిషనర్ మోహన్, డాక్టర్ ఆనంద్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మనోహరాబాద్ ఎస్సై రాజుగౌడ్, ఇన్చార్జి ఎంపీడీవో కృష్ణమూర్తి, డీఎల్పీవో లక్ష్మీనర్సింహులు, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి, వార్డు కౌన్సిలర్ లక్ష్మీబాయి, గంగాధర్, వెంకటేశ్ ఉన్నారు.
జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలి
అల్లాదుర్గం, జనవరి 21 : ఇంటింటి జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని జడ్పీ సీఈవో శైలేశ్కుమార్ కోరారు. శుక్రవారం కాయిదంపల్లి, చిల్వెర గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వేను జడ్పీ సీఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా సర్వే చేపడుతున్నామన్నారు. సర్వే బృందం సభ్యులు ప్రతిరోజూ 25 ఇండ్లను సర్వే చేయాలన్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారందరికీ హోంఐసొలేషన్ కిట్స్ అందజేయాలని సూచించారు. అర్హులైనవారు బూస్టర్ డోస్ టీకా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి, ఏపీవో పుణ్యదాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కరోనా కట్టడికి ఇంటింటి సర్వే..
నిజాంపేట, జనవరి 21 : కరోనా కట్టడి కోసం మండల వ్యాప్తంగా వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే చేపట్టారు. శుక్రవారం నిజాంపేటలో ఏఎన్ఎం అనురాధ, సెకండ్ ఏఎన్ఎం బాలమణి, ఆశ వర్కర్ బాలమణి, అంగన్వాడీ కా ర్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు అందజేశారు. వైద్య సిబ్బందితోపాటు స్థానిక సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరి ఫీవర్ సర్వేలో పాల్గొని కరోనాపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ కిష్టారెడ్డి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, టీఆర్ఎస్ నాయకుడు లక్ష్మీనర్సింహులు పాల్గొన్నారు.
జ్వరం సర్వేను సద్వినియోగం చేసుకోవాలి..
పాపన్నపేట, జనవరి 21 : జ్వరం సర్వే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీడీ భీమయ్య సూచించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీడీ భీమయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ సర్వేకు సహకరించి, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తిగౌడ్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
జోరుగా ఇంటింటి జ్వర సర్వే..
కొల్చారం, జనవరి 21 : కొల్చారం మండలవ్యాప్తంగా వైద్య సిబ్బంది శుక్రవారం ఇంటింటి జ్వర సర్వే చేపట్టారు. కలెక్టర్ ఆదేశాలతో వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవారిని గురించి మందులు అందజేశారు. మండల కేంద్రమైన కొల్చారం, చిన్నాఘన్పూర్, రాంపూర్, కిష్టాపూర్ గ్రామా ల్లో నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వేను ఎంపీడీవో ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు.
చిలిపిచెడ్లో..
చిలిపిచెడ్, జనవరి 21 : గ్రామాల్లో కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకే వైద్య సిబ్బంది ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నదని మండల ఐసీడీసీ సూపర్వైజర్ సంతోషమాత అన్నారు. శుక్రవారం మండలంలోని చిట్కు ల్, జగ్గంపేట, గౌతాపూర్, చండూర్, ఫైజాబాద్ గ్రామాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించారు. అనంతరం కరోనా లక్షణాలు ఉన్నవారికి మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
రేగోడ్లో..
రేగోడ్, జనవరి 21 : రేగోడ్ మండల కేంద్రంలో వైద్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. జ్వరం, జ లుబు, దగ్గు ఉన్నవారిని గుర్తించి మందులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శైలేశ్, సర్పంచ్ నర్సింహులు, ప్రజాపరిషత్ సూపరిండెంట్ రమేశ్, పంచాయతీ కార్యదర్శి తుకారాం, అంగన్వాడీ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.