యాదాద్రి, జనవరి 20 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. తులసీ దళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణి చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్ర నామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ.6,92,528 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
డోనర్ కాటేజీకి రూ.10 లక్షల విరాళం
యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న డోనర్ కాటేజీకి విరాళాలు అందించేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. హైదరాబాద్కు చెందిన సామల వెంకట్రెడ్డి- లక్ష్మి, సామల అభిషేక్రెడ్డి గురువారం రూ.10 లక్షల విరాళాన్ని సమర్పించారు. చెక్కును ఆలయ ఏఈఓలు గజవెల్లి రమేశ్బాబు, గట్టు శ్రవణ్కుమార్కు అందజేశారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుక్కింగ్ ద్వారా 48,000
రూ.100 దర్శనం టిక్కెట్ 21,000
వేద ఆశీర్వచనం 10,800
నిత్యకైంకర్యాలు 1,100
ప్రచారశాఖ 6,000
క్యారీబ్యాగుల విక్రయం 5,500
వ్రత పూజలు 40,800
కళ్యాణకట్ట టిక్కెట్లు 21,400
ప్రసాద విక్రయం 3,65,250
వాహనపూజలు 8,400
టోల్గేట్ 730
అన్నదాన విరాళం 1,886
సువర్ణ పుష్పార్చన 73,000
యాదరుషి నిలయం 54,280
పాతగుట్ట నుంచి 13,230