మియాపూర్ : ప్రజల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హైదర్నగర్ డివిజన్ పరిధిలోని రామ్నరేశ్నగర్లో రూ.42 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి విప్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవకర్గంలోని డివిజన్లలో ప్రజా అవసరాలను ఎప్పటికపుడు గుర్తిస్తూ తగిన ప్రతిపాదలతో అధిక నిధుల మంజూరుకు కృషి చేస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు తాను అహర్నిషలు కృషి చేస్తున్నట్లు విప్ గాంధీ పేర్కొన్నారు.
కరోనాతో పరిస్థితులు తారుమారైనా సంక్షేమాన్ని సమర్థంగా సీఎం కేసీఆర్ ముందుకు నడిపిస్తున్నారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందిస్తామని ఆయన స్ఫష్టం చేశారు.
అనంతరం విప్ ఆరెకపూడి గాంధీ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ ఫేజ్2, హెచ్ఎంటీ శాతవాహన,జలవాయువిహార్ కాలనీల్లో కార్పొరేటర్ శ్రీనివాసరావుతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ,తగు అభివృద్ధి పనులను చేపడతామని గాంధీ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్థన్, ఏఈ రాజీవ్, మహదేవ్, పార్టీ నేతలు దామోదర్రెడ్డి, రాజేందర్, ప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్, సత్యనారాయణ, అర్జున్, రాఘవేందర్, శ్రీకాంత్,అష్రఫ్, ఖదీర్ , బాలయ్య,విమల, స్వప్న, మాధవి, బీజాన్, దుర్గ, నక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.