చాదర్ఘాట్ :తెలంగాణ థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వ రాష్ట్ర స్థాయి థాయ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జాతీయ స్థాయి ఎంపికలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ప్యాకో మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్డిఫెన్స్ అకాడమీలో జరిగిన ఈ పోటీల్లో సబ్-జూనియర్స్, జూనియర్స్, సీనియర్ పురుషులు, మహిళల విభాగాలకు ఎంపికలు జరిగాయి. ఈ పోటీల్లో గ్రాండ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సయ్యేదా షఫియా సుల్తానా, మహ్మద్ ఫత్హే అలీ, రన్నరప్ గ్రాండ్ చాంఫియన్లో మహ్మద్ ఒమర్ ఫారూఖ్, సయ్యేదా సబా ఫర్హత్, సయ్యద్ గౌస్మోహియద్దీన్ స్సేన్, డాక్టర్ సుష్మితలు ఎంపికైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సెట్విన్ మాజీ చైర్మన్ మీర్ ఇనాయత్ అలీ బాక్రీ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అష్వాక్ మహ్మద్, అతీక్ ఐజాజ్, హఫీజ్ ఐజాజ్, మహ్మద్ అబ్దుల్ ముబషీర్, తెలంగాణ థాయి బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీనియర్ మాస్టర్ సయ్యద్ ఇఫ్తేకార్ హస్సేన్ తదితరులు పాల్గొన్నారు.