వనపర్తి టౌ న్, జనవరి 19 : గ్రామీణ ప్రభుత్వ పా ఠశాలలను బలోపేతం చే సేందుకు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మెరిట్ ప్రాతిపదికన జిల్లాలకు కేటాయించింది. దీంతో జిల్లాలో ని మారుమూల పాఠశాలల్లోకి సారోళ్లు వచ్చారు. దాదాపు జిల్లావ్యాప్తంగా 280 మంది ఉపాధ్యాయులు ఏకోపాధ్యాయ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విధుల్లో చేరారు. జిల్లావ్యాప్తంగా గణిత విభాగంలో 33, భౌతిక శాస్త్రంలో 32, ఎస్జీటీలు 180, ఎల్ఎఫ్ఎల్ 14, పీఈటీలు 21 మందితోపాటు హిందీ, తెలుగు మీడియం ఉపాధ్యాయులు కొలువుదీరారు. కొంతకాలంగా విద్యావలంటీర్లు, దాతల సహకారంతో కొన్ని పాఠశాలల్లో ప్రై వేట్ ఉపాధ్యాయులను, మరికొంతమందిని డిప్యూటేషన్పై కేటాయించి బోధన కొనసాగిస్తున్నారు. వీటన్నింటికీ 317 జీవోతో స్వస్తి పలికారు. వనపర్తి జిల్లాలో జీరో విద్యార్థులు ఉన్న 32 పాఠశాలల్లో పునఃబోధన ప్రారంభం కానున్నది. అందు లో 22 పాఠశాలల్లో ఇప్పటికే ఉపాధ్యాయుల కే టాయింపు పూర్తికాగా.. మరో 10 పాఠశాలలను ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెద్దమందడి మండలంలో 8 పాఠశాలలకుగానూ బాలికల ప్రాథమిక పాఠశాల పెద్దమందడి, అమ్మపల్లి తండా పీఎస్, గొర్మిళ్లతండా పీఎస్, నాగులకుంటతండా పీఎస్, ధన్సింగ్ తండా పీఎస్తోపాటు పెద్దమందడిలోని ఉ ర్దూ మీడియం పాఠశాలకు ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. వీపనగండ్లలో ఒంటిగుంటతండా పీఎస్, పాన్గల్ మండలంలోని బీసీ రేమద్దుల, దవాస్పల్లి పీఎస్, గంగనాయక్ తండా పీఎస్, గురిగింజమిట్ట తండా పీఎస్తోపాటు ఖిల్లాఘణపురంలోని కర్నెతండా, షా పూర్ తండా, బీకే తండా, దేవ్బండతండా, శ్రీ రంగాపురంలోని కంబాళాపురం తండాతో కలిపి మొత్తం 22 పాఠశాలలకు ఉపాధ్యాయులను కే టాయించారు. ఖిల్లాఘణపురం, పాన్గల్, చి న్నంబావి, శ్రీరంగాపురం, ఆత్మకూర్, అమరచిం త మండలాల్లోని సుదూర ప్రాంత ఉన్నత పాఠశాలలకు ఆయా సబ్జెక్టుల క్యాటగిరీల వారీగా ఉ పాధ్యాయులు కొలువుదీరారు. దీంతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రాథమిక, మాధ్యమిక విద్యను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందించేందుకు 317 జీవో వరంలా మారింది.
నిబంధనల మేరకే కేటాయింపు..
మెరిట్ ప్రాతిపదికన, నిబంధనల మేరకే ఎస్జీటీలు, పండిట్లు, ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులను గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల కేటాయించాం. కలెక్టర్ ఆదేశాల మేరకు జీవో విద్యార్థులు ఉన్న తండాల పాఠశాలల పునరుద్ధ్దరణ చర్యలు ముమ్మరం చేశాం. ఇప్పటికే ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తిచేశాం. విద్యార్థుల నమోదు బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుంది. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.