టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్
దేవరకొండలో ఘన స్వాగతం
దేవరకొండ, జనవరి 30 : పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యాక ఆదివారం తొలిసారి దేవరకొండకు వచ్చిన రవీంద్రకుమార్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన రవీంద్రకుమార్కు మాల్ నుంచి ప్రతి ైస్టెజీ వద్ద టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. దేవరకొండలో 600బైకులతో స్వాగతం పలికి ర్యాలీగా క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రవీంద్రకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ ఆరుకు ఆరు స్థానాలు కైవసం చేసుకునేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ అందించే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
డిండి రిజర్వాయర్ పనులు 90శాతం పూర్తి
డిండి ఎత్తిపోతల పథకంలో కొన్ని రిజార్వాయర్ల పనులు 90శాతం పూర్తయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలో అప్పర్ ప్లాట్ ప్రాంతం లో పచ్చటి పలాలు పండాలనే లక్ష్యంతో రూ.500కోట్లతో ఐదు లిఫ్టులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. రానున్న రెండేండ్లలో లిఫ్టుల పనులు పూర్తి చేసుకుని కొండల ప్రాంతాల్లో పచ్చటి పొలాలు కన్పిస్తాయన్నారు. తన నియామకానికి సహకరించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వాగతం పలికిన వారిలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు నల్లగాసు జాన్యాదవ్, మాధవరం సునీతాజానార్దన్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, వైస్ చైర్మన్ రహత్అలీ, టీఆర్ఏస్ మండలాధ్యక్షుడు టీవీఎన్రెడ్డి, పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేశ్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్నాయక్, మారుపాకుల సురేశ్గౌడ్, శిరందాసు కృష్ణయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనునాయక్, కౌన్సిలర్లు జయప్రకాశ్నారాయణ, మహ్మద్ రైస్, పగిడిమర్రి రఘురాములు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు కోలాట బృందాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.
చింతపల్లి ఆలయంలో పూజలు
మాల్ : కుర్మేడు నుంచి ర్యాలీగా వెళ్లి చింతపల్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, కుంభం శ్వేతాశ్రీశైలం గౌడ్,అండెకారు అశోక్, ఆలయ చైర్మన్ మంచికంటి ధనుంజయ్య, సాగర్రావు, కిష్టారెడ్డి, ఖాలేద్, పరమేశ్ పాల్గొన్నారు.