ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ధారూరు, నవంబర్ 29 : దేశంలో రైతు సంక్షేమానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం మారిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం ధారూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో, మండల పరిధిలోని దోర్నాల్ గ్రామంలో ఎమ్మెల్యే ఆనంద్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు ఉచితంగా 24గంటల విద్యుత్, సాగు నీరు, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నదన్నారు. గ్రామాల్లో ఏఈవోల సాయం తో వరి పండించిన రైతుల వివరాలను సేకరించి, దానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు ఉంటాయని, ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేవిధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చే రైతుల ఆధార్, బ్యాంక్ వివరాలు తీసుకొని నేరుగా రైతుల ఖాతాలో నగదు జమ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.