సత్తుపల్లి/ కల్లూరు/ తల్లాడ, జూన్ 29: ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆశాజ్యోతి అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. దళిత సాధికారత పథకం ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, విద్య, ఉద్యోగ, వ్యాపారపరంగా ముందడుగు వేస్తారని అన్నారు. దళితుల అభ్యుదయం కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చొరవ అద్భుతమని అన్నారు. దళిత సాధికారత పథకం కోసం రూ.1200 కోట్లు కేటాయించడం, ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం సత్తుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో, కల్లూరులోని ఎంపీడీవో కార్యాలయంలో దళితులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెచ్చిన ఈ సాధికారత పథకం ద్వారా దళితుల బతుకులు బాగుపడతాయని అన్నారు. చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన మరియమ్మ కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.35 లక్షలు పరిహారం, ఆమె కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అండగా నిలిచారని గుర్తుచేశారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి నాయకులు పగుట్ల వెంకటేశ్వరరావు, మారం సుమలత, విస్సంపల్లి వెంకటేశ్వరరావు, పాలకుర్తి సునీత, చెట్టుమాల రేణుక, రాయపూడి మల్లయ్య, తడికమళ్ల సీత, మోదుగు పుల్లారావు పాల్గొన్నారు.
కల్లూరులో..
కల్లూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోనూ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. ఎంపీపీ బీరవల్లి రఘు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు అధ్యక్షతన దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, బోబోలు లక్ష్మణరావు, ఇస్మాయిల్, కొరకప్పు ప్రసాద్, పరిగడుపు రాము పాల్గొన్నారు.
తల్లాడలో..
తల్లాడలోనూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పుష్పాభిషేకం చేశారు. ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, వైరా ఏఎంసీ వైస్చైర్మన్ దూపాటి భద్రరాజు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శీలం కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.