సబ్సిడీపై చేప పిల్లలు అందజేస్తున్న ప్రభుత్వం
చెరువుల్లో వదిలిన ప్రజాప్రతినిధులు
హవేళీఘనపూర్, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువులకు మరమ్మతులు చేయడంతో కురిసిన వర్షాలకు చెరువులు నిండు కుండాలా కనిపిస్తున్నాయి. దీంతో మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సహించేందుకు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులు, కుంటల్లో మత్స్యశాఖ ఏడీ మల్లేశం ఆధ్వర్యంలో చేప పిల్లలను వదిలారు. మత్స్యకారులను ప్రోత్సహించేందుకు టూవీలర్స్ ను అందించడంతో పాటు వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను అందజేస్తుండడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఏటా చేపపిల్లలు వదులుతుండడంతో తమకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గతంలో చేపలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మత్స్యకారులకు సీఎం కేసీఆర్ ఉపాధి కల్పిస్తూ ప్రోత్సహిస్తూ ఉండడం అభినందనీయమని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
గతంలో వివక్షకు గురైన మత్స్యకారులకు టీఆర్ఎస్ ప్రభు త్వం ఉపాధి అవకాశాలు కల్పించి వారి సంక్షేమం కోసం ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోని మత్స్యకారులను నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం వందశాతంసబ్సిడీపై చేప పిల్లలు, టూవీలర్ అందజేస్తున్న ది. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి:
మత్స్యకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడం తో చేతినిండా పని దొరుకుతుంది.కుటుంబాన్ని పోషించుకునే స్థాయికి ఎదిగాం. ఇందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తు న్న కృషి, సంక్షేమ పథకాలతో ఆనందంగా గడుపుతున్నాం. నిత్యం చేపలు పట్టుకుంటూ వాటిని అమ్ముకొని జీవనం సాగిస్తున్నాం.
-చీమల రవి, చౌట్లపల్లి