ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
జిన్నారం శివారులోని రంగరాముల గుట్ట వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాలు
పూజలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి
జిన్నారం, నవంబర్ 28 : ఆధ్యాత్మికతతో మనసుకు ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మండల కేంద్రం జిన్నారం శివారులోని రంగరాముల గుట్ట వద్ద గ్రామస్తులు ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం కార్తికమాసంలో సత్యనారాయణ వ్రతాలు ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. జిన్నారంలోని కోదండ సీతారామస్వామి ఆలయం నుంచి రంగరాముల గుట్ట వరకు సీతారామచంద్రులను పల్లకీలో ఊరేగించారు. అనంతరం రంగరాముల గుట్ట వద్ద ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు చంద్రారెడ్డి, వెంకటేశంగౌడ్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడారు. గ్రామస్తులందరూ ప్రతి సంవత్సరం సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడారు. సీతారామచంద్రుల శోభాయాత్ర, సామూహిక సత్యనారాయణ వ్రతాలకు హాజరవడం సంతోషంగా ఉందన్నారు. ఆత్మానంద ఆశ్రమ దత్త పీఠాధిపతి వేంకటస్వామి గురూజీ శోభాయాత్ర, సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొని భక్తులకు ప్రవచనాలు వినిపించారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ లావణ్య నరేశ్, కోదండరామస్వామి ఆలయ కమిటీ చైర్మన్ భోజిరెడ్డి, ఉపసర్పంచ్ సంజీవ, గురుస్వామి కరుణాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, జిన్నారంతో పాటు చుట్టు పక్క గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.