జిల్లా వ్యాప్తంగా దివంగత ప్రధాని నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు
నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
సిరిసిల్ల టౌన్, జూన్ 28: మున్సిపల్ కార్యాలయంలో పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఇక్కడ టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
వేములవాడ, జూన్ 28: మున్సిపల్ కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చిత్రపటానికి కమిషనర్ శ్యామ్సుందర్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. బహుభాషా కోవిదుడు, తెలుగు ప్రజలు గర్వించే వ్యక్తి పీవీ నర్సింహారావు అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను స్మరిస్తూ ఏడాదిపాటు జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇక్కడ ఏఈ శ్రావణ్కుమార్, ఆర్ఐ మురళి, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ నర్సయ్య, రవీందర్, నియాజ్ ఉన్నారు.
వేములవాడ రూరల్, జూన్ 28: వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో పీవీ నర్సింహారావు చిత్రపటానికి ఎంపీపీ బూర వజ్రమ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్, రఘు, సిబ్బంది ఉన్నారు.
బోయినపల్లి, జూన్ 28: మండల పరిషత్లో పీపీ చిత్ర పటానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ ఎంపీపీ వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఎంపీవో గంగాతిలక్, ఎంపీటీసీ ఉపేందర్, రామన్నపేట సర్పంచ్ కన్నం మధు, ఏఎంసీ డైరెక్టర్ నల్లగొండ అనిల్, నాయకులు కత్తెరపాక కొండయ్య, సంబ లక్ష్మీరాజం ఈడ్గు స్వామి, కవంపల్లి రాములు, కొంకటి మధు, నాగుల శ్రీను, శంకర్ ఉన్నారు.
చందుర్తి, జూన్ 28: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కు మండల విద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయులు నివాళులర్పించారు. ఇక్కడ హెచ్ఎం విక్కుర్తి లక్ష్మీనారాయ ణ, ఉపాధ్యాయులు ముకేశ్, రవికుమార్, చంద్రకళ, సుజా త, దేవరాజు, తదితరులు ఉన్నారు.