జైపూర్ ఏసీపీ నరేందర్
మావోయిస్టు కుటుంబ సభ్యులకు పరామర్శ
కోటపల్లి, జూన్ 27 : మావోయిస్టులు లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని జైపూర్ ఏసీపీ నరేందర్ అన్నారు. మండలంలోని బబ్బెరచెలుక గ్రా మానికి చెందిన మావోయిస్టు నేత, ఎస్జెడ్సీ మెంబర్ మూల దేవేందర్ రెడ్డి వాళ్ల అక్కా-బావ కోరళ్ల ఇందిరా రవీందర్ రెడ్డిని, పారుపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు నేత ఆత్రం లచ్చన్న (అలియాస్ గంగన్న, గోపన్న, రాజప్ప) వదిన ఆత్రం లచ్చక్కను చెన్నూర్ రూరల్, టౌన్ సీఐలు నాగరాజు, ప్రవీణ్, కోటపల్లి ఎస్ఐ రవి కుమార్తో కలిసి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భం గా రెండు కుటుంబాలకు పండ్లను అందజేసి మా ట్లాడారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సోకి సరైన వైద్యం అందక మావోయిస్టులు మృతి చెందుతున్నారని, లొంగిపోతే వారికి మెరుగైన వైద్యం అందించడంతో పా టు వారిపై ఉన్న రివార్డు నగదును వారికే అంది స్తామని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారి బాగోగులు చూసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల స్త్రీశిశుసంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మూల రాజిరెడ్డి, స్థానిక నాయకులు సీతారాంరెడ్డి పాల్గొన్నారు.
లొంగిపోవాలి..
మావోయిస్టు నేతలు మూల దేవేందర్ రెడ్డి, ఆత్రం లచ్చన్న లొంగిపోవాలని వారి కుటుంబ సభ్యులు కోరారు. మావోయిస్టు ఎస్జెడ్సీ మెం బర్ మూల దేవేందర్ రెడ్డి వాళ్ల అక్కా కోరళ్ల ఇంది ర, కోడలు కవిత, మరో మావోయిస్టు నేత ఆ త్రం లచ్చన్న వాళ్ల వదిన మీడియాతో మాట్లాడారు. ఎన్కౌంటర్లో, కరోనాతో మావోయిస్టులు చని టపోయారనే వార్త టీవీలో చూసినప్పుడల్లా భయమవుతుందని, ఇప్పటికైనా పోలీసులకు లొంగిపోవాలని పిలుపునిచ్చారు.